‘ఏబీసీడీ’ వెనక చరణ్ రిఫరెన్స్


అల్లు శిరీష్‌ కథానాయకుడు నటించిన చిత్రం “ఏబీసీడీ”. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. రుక్సార్‌ కథానాయిక. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు శిరీష్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘రామ్‌ చరణ్‌, వరుణ్‌తేజ్‌ ఈ సినిమా చూసి.. నేను చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత సంజీవ్ రెడ్డి ఓ కథతో నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ‘ఏబీసీడీ’ రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుందని అడిగా. ఆయన కూడా నేను చూశా, చేద్దాం అన్నారు. అలా ఈ సినిమా కుదిరింది. అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఓ కుర్రాడు చేతిలో డబ్బులు లేకుండా ఇండియాకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అతడు ఎలా నెట్టుకొచ్చాడనేదే ఈ సినిమా కథ’ అన్నారు శిరీష్.