విజయవాడలో ‘మహర్షి’ విజయోత్సవం.. డిటైల్స్ !

‘మహర్షి’ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ సినిమా విజయంతో అభిమానులు, మహేష్ కూడా కాలరెగిరేసిన సంగతి తెలిసిందే. సినిమాకు వస్తున్న స్పందనపై మహేష్ ఆనందంలో ఉన్నాడు. మునుపెన్నడూ లేనివిధంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుసగా సక్సెస్ మీట్లు, థియేటర్స్ సందర్శన చేస్తున్నారు. గురువారం మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులని కలిశారు. తెలంగాణలో సరే… ఏపీలోనూ మహర్షి విజయోత్సవ సభని నిర్వహించబోతుంది.

విజయవాడలో ఈనెల 18న సక్సెస్ మీట్ ని ప్లాన్ చేశారు. విజయవాడలోని సిద్దార్థ్ ఇనిస్టూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ మైదానంలో మహర్షి విజయోత్సవ వేడుక జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు హాజరుకాబోతున్నారనే ప్రస్తుతానికి సస్పెన్స్. ఇండస్ట్రీ ప్రముఖులు, మహేష్ 25వ చిత్రాల దర్శకులు హాజరుకావొచ్చని సమాచారమ్.