మహేష్’ని ఇరుకున పెట్టిన విశాల్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తమిళ్ స్టార్ కు ఎక్కడ లింకు అనేదే లేదు. కాకపోతే.. విశాల్ చేస్తున్న ఓ మంచి పని మహేష్ ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. సాయం చేయడంలో విశాల్ ఎప్పుడూ ముందుంటారు. గతంలో ‘అభిమన్యుడు’ చిత్రం విజయం సాధించిన సందర్భంగా.. విశాల్ రైతులకు విరాళం అందించాడు. ఇప్పుడు అయోగ్య చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రానికి అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి ఒక్కో రూపాయని రైతుల సంక్షేమ నిధికి విరాళంగా అందించనున్నట్లు విశాల్ ప్రకటించాడు.

ఇదే మహేష్ ని ఇబ్బంది పెడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం మహర్షి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన హిట్ టాక్ తెచ్చుకొంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డు బద్దలవుతున్నాయి. మహేష్ కెరీర్ లోనే తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మహర్షి నిలిచింది. సినిమాలో రైతు సమస్యలని ప్రస్తావించడంపై ప్రశంసల వర్షం కురుస్తొంది. ఐతే, రైతులు, వ్యవసాయం అంటూ సందేశాలు ఇవ్వడమేనా.. విశాల్ తరహా రైతులకి ఏదైనా సాయం చేసేది ఉందా.. ?? కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. విశాల్ ని స్ఫూర్తిగా తీసుకొని.. మహర్షి కూడా ఓ రూపాయి రైతుల కోసం ప్రకటిస్తాడేమో చూడాలి.