విమానంలో శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం

ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని తీసుకెళ్లడంపై
సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఒప్పుకోలేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన వాయిద్య పరికరాన్ని విమానాశ్రయంలోనే వదిలేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ మ్యుజిషియన్స్‌ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు. నాకు గుణపాఠం చెప్పారు’ అని రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది. ‘శ్రేయా.. మీ పట్ల ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. అసలేం జరిగిందో.. మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్తారా ?’ అని పేర్కొంది.