రవిప్రకాష్’పై మరో కేసు.. !

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. ఆయన టీవీ9 లోగోలు అమ్ముకొన్నారని అలంద మీడియా కంపెనీ డైరక్టర్ మరో ఫిర్యాదు చేశారు. టీవీ9కి చెందిన లోగోలన్నింటినీ రూ. 99వేలకు మోజో టీవీ ఎండీ హరికిరణ్‌కు అమ్మేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘టీవీ9 లోగోలన్నీ ఇప్పుడు నెక్ట్స్ ఇండియా కంపెనీకి చెందినవి. ఆ లోగోలకు సంబంధించి రూ. 99వేల రూపాయలను కూడా ఆ సంస్థ ఏబీసీఎల్‌కు చెల్లించింది. ఇది రికార్డుల్లో కూడా నమోదయింది. ఫిబ్రవరి 28వ తేదీన కంపెనీ బుక్స్‌లో కూడా దీన్ని నమోదు చేశారు’ అని అలంద మీడియా కంపెనీ డైరక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం రవిప్రకాష్ అజ్ఝాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా రవిప్రకాష్ ని అరెస్ట్ చేయొచ్చు. హీరో శివాజీ కూడా అజ్జాతంలో ఉన్నారు.