ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకి భారీ నజరానా !

ప్రపంచకప్‌-2019 వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి ఇంగ్లండ్‌ వేల్స్‌లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి కప్‌ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్‌ డాలర్ల (రూ. 28కోట్లు) నగదు బహుమతి లభించనుంది. రన్నరప్‌కు రెండు మిలియన్‌ డాలర్లు (రూ.14 కోట్లకుపైగా) అందనున్నాయి.

ఇక, సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు (రూ.5కోట్లుకుపైగా) అందుతాయి. లీగ్‌ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. ఇక లీగ్‌ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది. మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.