‘మురారి2’పై కృష్ణవంశీ ప్రకటన


సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ‘మురారి’ ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతోనే తనలోనూ నటుడు ఉన్నాడనే నమ్మకం కలిగిందని మహేష్ చెబుతుంటాడు. ఐతే, మురారి సీక్వెల్ చేస్తే బాగుంటుందని మహేష్ అభిమానుల కోరిక. ఆ కోరికని దర్శకుడు కృష్ణవంశీకి చెబితే ఏమన్నాడో తెలుసా ? రెండో ‘మురారి’ ఉండదు సర్‌ ! ఒకే ఒక్క ‘మురారి’ అంతే! అనేశాడు. అదీ నిజమే. మురారి ఓ క్లాసిక్. అప్పట్లో అలా అదిరింది అంతే. ఆ మేజిక్ మళ్లీ రిపీట్ కావాలంటే కష్టమే. అందుకు మురారి2కి వంశీ నో చెప్పేశాడు.

ఒకప్పటి కృష్ణవంశీ కనబడక చాన్నాళ్లయింది. గులాబీ, నిన్నేపెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు వంశీ. ఆ తర్వాత ఆయన నుంచి ఆ రేంజ్ సినిమాలు రాలేదు. ‘నక్షత్రం’ సినిమా తర్వాత ఆయన ‘వందేమాతరం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఖడ్గం టైపు సినిమా అని తెలిసింది.