ప్రభాస్ ప్రేమకథ కోసం రూ.30కోట్ల సెట్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జెడ్ స్వీడుతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులని కొనసాగిస్తున్నారు.

‘సాహో’తో పాటుగా రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రం కోసం ‘జాన్’ టైటిల్ పరిశీలనలో ఉంది. 1970 కాలం నాటి కథతో సాగుతుందట. కథ ప్రకారం యూరఫ్‌లోని కొన్ని రియలిస్టిక్ లొకేషన్లలో షూటింగ్ చేయాల్సి ఉంటుందట. ఐతే, వాటికోసం హైదరాబాద్ శివారుల్లో భారీ సెట్ వేయనున్నారు.

ఇందుకోసం ఏకంగా రూ. 30కోట్ల ఖర్చు అవుతుందట. ఈ సెట్ లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆ రేంజ్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. సాహో, జాన్ ల బడ్జెట్ దాదాపు రూ. 200కోట్ల పై మాటే. ఈ రెండు సినిమాల తర్వాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండబోతుందని సమాచారమ్.