భారత్ : జిందా సాంగ్.. మీ కోసం

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వ వహిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్. దిశా పటానీ, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరో వరుణ్ ధావన్ గెస్ట్ రోల్ లో మెరవనున్నారు. ‘భారత్’ రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం.

ఇందులో భాగంగా తాజాగా భారత్ నుంచి ‘జిందా.. ‘ పాటని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటతో కొంత కథని రివీల్ చేసే ప్రయత్నం చేసింది చిత్రబృందం. సల్మాన్ మూడు గెటప్స్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ వచ్చిన ఈ సాంగ్ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలని పెంచేసింది. పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ రంజాన్ కి సల్మాన్ అభిమానులకి విందు భోజనమే.. !