ప్రభాస్ ని వాడుకొంటున్న బాలీవుడ్


బాలీవుడ్ రికార్డులని మన ‘బాహుబలి’ చెరిపేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలుగు స్టార్స్ పై బాలీవుడ్ లో గౌరవం పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్ ని బాలీవుడ్ బాగా ఇష్టపడుతోంది. ఆయన క్రేజ్ ని వాడుకోవాలని చూస్తోంది. దీనికి నిదర్శనమే తాజాగా షాహిద్ కపూర్ చేసిన వ్యాఖ్యలు. షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అర్జున్ రెడ్డి కి రిమేక్. ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ ట్రైలర్ పై ప్రభాస్ స్పందించడాన్ని షాహిద్ గొప్పగా చెప్పుకొన్నాడు.

కబీర్ సింగ్ ట్రైలర్ ప్రభాస్ కి బాగా నచ్చింది. కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి సినిమాకు కాపీ-పేస్ట్ లా లేదని ప్రభాస్ చెప్పడం సంతోషంగా ఉందని, ప్రభాస్ లాంటి హీరో నుంచి ప్రశంసలు రావడంతో తన సంతోషానికి హద్దుల్లేవని షాహిద్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో షాహిద్ కత్తిలాంటి హీరోయిన్స్ తో రొమాన్స్, యూత్ లో మంచి ఫాలోయింగ్.. షాహిద్ క్రేజే వేరుగా ఉండేది. అలాంటి షాహిద్ ఇప్పుడు సినిమా ట్రైలర్ తనకు నచ్చిందని ప్రభాస్ చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇది నిజంగా ప్రభాస్ క్రేజ్ ని వాడుకోవడమే.