‘వాల్మీకి’ తేడా కొడుతున్నాడేంటీ.. ?

‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి దర్శకుడు హరీష్ శంకర్ కిందా మీదా పడ్డాడు. ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్ కథ రాసుకొన్న నిర్మాత దొరక్క పట్టాలెక్కలేదు. ఫైనల్ గా తమిళ్ హిట్ ‘జిగర్తాండ’ రిమేక్
‘వాల్మీకి’ తీసుకొస్తున్నారు. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. మాతృకలో బాబీ సింహా చేసిన పాత్ర కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని తీసుకొన్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

వాల్మీకి హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకొన్నారు. అసలే మూడు షిప్టులు పని చేస్తున్న పూజా.. వాల్మీకి నుంచి తప్పుకొంది. రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడం వలనే ఆమె తప్పుకొన్నట్టు సమాచారమ్. తాజాగా, ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకొన్నారు. ‘మహర్షి’ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం దేవిశ్రీని తీసుకొన్నారు. దీంతో ఆయన వాల్మీకి నుంచి తప్పుకొన్నట్టు సమాచారమ్. ఆయన స్థానంలో మిక్కీ జె మేయర్ ని తీసుకొన్నారు.