పవన్ లేకుండానే.. జనసేన ఆఫీసులో ఇఫ్తార్ విందు !

హైదరాబాద్ జనసేన కార్యాలయంలో శుక్రవారం ఇఫ్తార్ విందు జరిగింది. దానికి సంబంధించిన వీడియోని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ముస్లిం సోదరులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు వీడియోని చూస్తే అర్థమవుతోంది. ఐతే, ఒక్కటే లోటు. ఈ వేడుకల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. పవన్ కూడా ఉంటే ఇఫార్ విందు మరింత పసందుగా ఉండేదని జనసైనికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

ఇక, ఏపీలో జనసేన కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెదేపా, వైకాపా రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఐతే, ఈ రెండు పార్టీలకి స్పష్టమైన మెజారిటీ రాకుండా జనసేన కీలకంగా మారనుంది. ప్రస్తుతానికైతే జనసేన తెదేపాతోనే ఉంది. ఫలితాల తర్వాత ఆ పార్టీ ఏ టర్న్ తీసుకొనుంది. ప్రభుత్వం ఏర్పాట్లులో కీలకంగా మారనుందా.. ?? అనేది ఆ పార్టీ గెలుచుకొనే అసెంబ్లీ సీట్లపై ఆధారపడి ఉండనుంది. అది ఈ నెల 23తో తేలనుంది.