విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకొన్నారు. మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తోంది. అంతకుమించి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మహర్షి చిత్రబృందం విజయవాడలో విజయోత్సవసభని నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు కొద్దిసేపటి ముందు మహర్షి చిత్రబృందం ఇంద్రకిలాద్రికి వెళ్లారు. దుర్గమ్మ దర్శనం చేసుకొన్నారు. అక్కడి నుంచి మహర్షి విజయోత్సవ సభకు చేరుకొన్నారు.

మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యావ్యవస్థలోని లోపాలు, రైతు సమస్యలని లేవనెత్తారు. అది ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేష్ మూడు పాత్రల్లో కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతు పాత్రల్లో అలరించారు. మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.