20న రాళ్లపల్లి అంత్యక్రియలు

ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు అంత్యక్రియలు ఆదివారం (మే20) జరగనున్నాయి. హైదరాబాద్ లోని
మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాళ్లపల్లి బంధువులు ప్రకటించారు. రాళ్లపల్లికి ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఒకరు చాన్నాళ్ల క్రిందటే మృతి చెందరు. మరో కూతురు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆమె ఆదివారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. దీంతో.. ఆ రోజే రాళ్లపల్లి అంత్యక్రియలని నిర్వహించనున్నారు.

రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8వేలకు పైగా నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు.1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు.