అది రాళ్లపల్లి గొప్పదనం

నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. నటుడు నిత్య విద్యార్థి అని రాళ్లపల్లి అనేవాడని నటుడు తనికెళ్లభరణి గుర్తు చేశారు. రాళ్లపల్లి సహజ నటన తనకెంతో ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

రాళ్లపల్లి తన పుట్టినరోజు వేడుకని జరుపుకొనేవారు కాదు. కానీ, ఆ రోజున నటుల కోసం రూ. 50వేలు విరాళం ఇచ్చేవారని అలీ గుర్తు చేశారు. ప్రతి యేడాది తన పుట్టినరోజుకి రాళ్లపల్లి విరాళం ఇచ్చేవారని తెలిపారు. రాళ్లపల్లి 850కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ కమెడియన్ గా రాణించారు. ఆయన నటించిన ఆఖరి తెలుగు చిత్రం భలే భలే మగాడివోయ్.

రాళ్లపల్లికి ఇద్దరు కూతుళ్లు. గతంలోనే ఓ కూతురు మృతి చెందారు. మరో కూతురు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆమె తిరిగొచ్చాకే రాళ్లపల్లి అంత్యక్రియులు నిర్వహించనున్నారని తెలుస్తోంది.