రాళ్లపల్లి అంత్యక్రియలు పూర్తి


తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ లోని మహాప్రస్తానంలో జరిగాయి. ఇండస్ట్రీ కి చెందిన పలువురు రాళ్లపల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. టాలీవుడ్ యువ కమెడియన్లు రాళ్లపల్లి పాడేమోశారు. రాళ్లపల్లి కూతురు అమెరికాలో ఉండటం కారణంగా.. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలని పూర్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్‌ 10న జన్మించిన రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య, ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర చిత్రాల్లో నటించారు.