బీజేపీ విందుకు బీహార్ సీఎం

బీజేడీ.. బీజేపీ మిత్రపక్షమే. కానీ, అప్పుడప్పుడు కాదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అవసరమైతే బీజేపీతో స్నేహం చేస్తారు. లేదంటే సైడైపోతారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్ కుమార్ కొన్నాళ్లు ఎన్డీయేకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ కలిశారు. ప్రస్తుతం ఆయన ఎన్డీయే భాగస్వామియే. ఈ సాయంత్రం ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు నితీష్ కుమార్ హాజరుకాబోతున్నారు.

ఇప్పటికే నితీష్ కుమార్ పాట్నా నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీయేదే అధికారమని వెల్లడించడంతో ఉత్సాహంతో విందు సమావేశం ఏర్పాట్లు చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా ఎన్నికల్లో సహకరించిన మిత్రపక్షాలకి షా కృతజ్ఝతలు తెలపనున్నారు. అదే సమయంలో ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.