‘రూపాయికే అంత్యక్రియలు’ పథకం బేష్

కరీంనగర్ నగరపాలక సంస్థ తీసుకొచ్చిన ‘రూపాయికే అంత్యక్రియలు’ పథకంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ రూ.1 కే అంత్యక్రియలు పథకాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం రూ. 1.50 కోట్లు కేటాయించారు. వీటితో వాహనాలు, ఫ్రీజర్, ఇతర సామ గ్రి కొనుగోలు చేయనున్నారు. జూన్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేనున్నారు.

ఈ పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని కుల, మత, పేద, ధనిక వర్గాలకు అతీతంగా అమలు చేయడంపై అభినందనీయమన్నారు. పథకానికి నిధులు కేటాయించడాన్ని అభినందించారు. ఈ పథకం పట్ల కరీంనగర్ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.