ప్రభాస్ అభిమానులకు.. ఇక పండగే !

బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ అభిమానులకి వెయిటింగ్ తప్పలేదు. సాహో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న రావాల్సిన ‘సాహో’ వాయిదాపడే అవకాశాలున్నాయనే వార్తలు ఫ్యాన్స్ ని కలవరపెట్టాయి. ఐతే, సాహో రిలీజ్ డేటు రావడంతో డౌట్ లు అన్నీ తీరిపోయాయి. మరో ఏడు వారాల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సాహో నుంచి వరుస అప్ డేట్స్ రాబోతున్నాయి. ఇటీవలే పార్క్ హయాత్ హోటల్లో ప్రభాస్ కు స్పెషల్ ఫోటో షూట్ చేసారు.

మూడు మాంచి పోస్టర్లు రెడీ చేసారు. మంగళవారం విడుదల చేసిన పోస్టర్ ఇందులో ఒకటి. హీరోయిన్ తో వుండే పోస్టర్ కూడా ఉంది. పోస్టర్ లు, మేకింగ్ విడియోలు క్యూ కట్టబోతున్నాయి. వారానికోటి విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇటీవలే ప్రభాస్ ఫేస్ బుక్ లో కూడా ఫ్యాన్స్ ను పలకరించడం మొదలుపెట్టాడు. ఇన్ స్టా గ్రామ్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. సాహో సినిమా కోసం ప్రభాస్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ కావాలని ప్రభాస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి.. సాహో పండగ మొదలైపోయింది.