పోస్టల్ బ్యాలెట్ : ఆధిక్యంలో బీజేపీ


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఐతే, పోస్టర్ల్ బ్యాలెట్ ఎఫెక్ట్ 0.1శాతం మాత్రమేనని తెలుస్తోంది. మరో 30 నిమిషాల్లో ఈవీఎంల కౌంటింగ్‌ మొదలుకానుంది. వాటిలోనూ బీజేపీ ఆధిక్యం చూపించినట్టయితే.. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఎన్ డీయే వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మరోసారి ఎన్ డీయే అధికారంలోకి రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎన్ డీయే 330సీట్లు రావొచ్చని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోస్ ఎగ్జాట్ పోల్స్ అవుతాయా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక ఏపీలో పోస్టర్ బ్యాలెట్ లెక్కింపులో ఎవరు ముందంజలో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు.