జగన్, మోడీలకి కేటీఆర్ శుభాకాంక్షలు

ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. అఖండ విజయం సాధించి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ మిత్రులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు మరోసారి మాకు మెజార్టీ స్థానాలు కట్టబెట్టారు. కేంద్రంలో మనకు కావాల్సిన హక్కులు సాధించే బాధ్యతను తెరాసపై పెట్టారు. మెరుగైన ఫలితాలు రావాలని కోరుకున్నాం. 16 స్థానాలు సాధించాలని కష్టపడ్డాం. తెరాస కార్యకర్తలు ఎంతో శ్రమించారు. ప్రజలు తమ ఓట్లతో మాకు 9 స్థానాలిచ్చారు. మా మిత్ర పక్షం ఎంఐఎం హైదరాబాద్‌లో గెలిచింది. మిగతా ఏడు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌, భాజపా మిత్రులందరికీ శుభాకాంక్షలు అన్నారు కేటీఆర్.