వారణాసిలో మోడీ ఘన విజయం

వారణాసి నుంచి నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 3లక్షల 60వేల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఇక కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 330పై స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించబోతున్నట్టు ఫలితాల ట్రెండ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 29న ప్రధాని ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించబోతున్నట్టు సమాచారమ్. వాస్తవానికి ఈసారి ఎన్ డీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందని బీజేపీ నేతలు సైతం భావించారు. కానీ, వారి అంచనాలకి మించి బీజేపీ విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసే మెజారిటీ సాధించారు. బీజేపీ ఘన విజయం నేపథ్యంలో మోడీకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.