జనసేన కంటే ప్రజారాజ్యం బెటరబ్బా.. !


ఏపీలో జనసేన ప్రయత్నం ఫెయిల్ అయినట్టు కనబడుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండ్ ప్రకారం.. ఆ పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందడమే గగనంగా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలో జనసైనికులు నిరాశలో ఉన్నారు.

మరోవైపు, సోషల్ మీడియా వేదికగా జనసేనపై విమర్శలు మొదలయ్యాయి. ఉత్తమ రాజకీయ ‘నటుడు’ పవన్ అని ఆంధ్ర ప్రజలు తేల్చారని కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ఫలితాలని ప్రజారాజ్యంతో పోలుస్తున్నారు. ప్రజారాజ్యం తొలిసారి ఎన్నికబరిలోకి దిగి 18స్థానాల్లో విజయం సాధించింది. ఐతే, ఆ తర్వాత పార్టీని నిలపలేక కాంగ్రెస్ లో కలిపేశారు మెగాస్టార్ చిరంజీవి. ఐతే, ఇప్పుడు జనసేన ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకొనే పరిస్థితి కనబటం లేదు. ఈ నేపథ్యంలో జనసేన కంటే ప్రజారాజ్యం బెటరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.