మోదీ గెలుపుపై సిద్ధార్థ్ ఛాలెంజ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ఆసక్తికర ట్విట్ చేశారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలో రాకపోతే తాను ట్విటర్‌ నుంచి తప్పుకొంటానని అన్నారు. ఇంకెప్పటికీ ట్విటర్‌ ఖాతాను తెరవనని తేల్చి చెప్పారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వెలువడిన సమయంలో సిద్ధార్థ్‌ నెగిటివ్‌గా కామెంట్‌ చేశారు. ‘ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమే. కానీ అసలైన ఫలితాల కోసం వేచి చూడాలి. ఈలోగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కలిగే మార్పేమీ ఉండదని మనం గుర్తించాలి. గందరగోళానికి గురై ప్రయోజనం లేదు. అంచనాలను చూసి మురిసిపోవనవసరం లేదు’ ట్విట్ చేశారు. ఐతే, ఫలితాల ట్రెండ్స్ ని చూసి సిద్ధార్థ్ ప్లేట్ ఫిరాయించినట్టు కనబడుతోంది. ఆయన మోడీ గెలుపుని ఆక్షాంక్షిస్తున్నారు. ఐతే, ప్రస్తుతం వారణాసిలో మోడీ వెనకంజలో ఉన్నారు.