తెరాసకి టెన్షన్ లేదు


దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాజకీయ పార్టీలు టెన్షన్ లో కనిపిస్తున్నాయి ఐతే, తెరాసకి మాత్రం ఆ టెన్షల్ లేదు. తెలంగాణలో తెరాస హవా మరోసారి కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. రాజకీయ విశ్లేషకులది అదే మాట. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ అలాగే ఉన్నాయి.

ప్రస్తుతం తెరాస 11స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐతే, ఊహించని విధంగా బీజేపీ 5స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ ఆధిక్యం ఆఖరి వరకు కొనసాగదు. భాజాపా ఆధిక్యం కనబరుస్తున్న స్థానాల్లోనూ ఫైనల్ గా తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా.. తెరాస నేతల్లో ఎలాంటి టెన్షన్ కనబడటం లేదు. ఆ పార్టీ కారు సారు పదహారు స్లోగన్ వందశాతం ఫలించేలా కనబడుతోంది.