మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా : జగన్

ఏపీలో వైకాపా అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ ఏకంగా 150స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఐదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే లభించే అరుదైన అవకాశాన్ని ప్రజలు తనకు అందించారని.. ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపుతా. ఆర్నెళ్ల నుంచి ఏడాది లోపే తానొక మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానన్నారు.

ఈ విజయం నాపై మరింత బాధ్యతల్ని పెంచుతుంది. నాపై ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ప్రజలు ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేశారు. విశ్వసనీయతలేని నాయకుల పరిస్థితి ఏమిటో తమ ఓటు ద్వారా చూపించారు. మంచి సీఎం అన్పించుకొనేలా కచ్చితంగా నా ప్రతి అడుగూ వేస్తానని మాటిస్తున్నా. నాపై విశ్వాసం ఉంచినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా. నవరత్నాలను తెచ్చే పాలన ఇవ్వబోతున్నాం అన్నారు.