పవన్ ఓటమిని ఎంజాయ్ చేస్తున్న అభిమానులు


జనసేన పార్టీ తొలి ప్రయత్నం విఫలమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకొంది. ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలోనూ ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ ఓటమిని ఆయన అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే, ఇక్కడో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పవన్ అభిమానుల్లో చాలామందికి ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. హీరోగా మాత్రమే పవన్ ని ఇష్టపడే అభిమానులు జనసేన ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఎందుకంటే ? పవన్ ని మళ్లీ తెరపై చూడొచ్చన్న ఆశ. ఏపీలో జనసేన కింగ్ మేకర్ అయినా, కొన్ని స్థానాల్లో విజయం సాధించినా.. పవన్ మళ్లీ సినిమాల వైవు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం ఉంది. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత పవన్ మళ్లీ మొహానికి రెడీ అవుతారనే టాక్ ఉంది. ఇప్పుడిదే పవన్ అభిమానులని సంతోషపెడుతోంది. దీని ముందు జనసేన ఘోర పరాజయం వాళ్లకి చిన్నదిగా అగుపిస్తోంది. దానికి కారణం అభిమానుల దృష్టిలో పవన్ ఎప్పుడు హీరోనే. ఆ హీరోయిజంని తెరపై చూడాలి ఆశపడుతున్నారు. అలాగన్ని.. వాళ్లు జనసేన ఓడిపోవాలని కోరుకోలేదు. కానీ, అలా జరిగిందంటే.. !