సప్రైజ్ : ‘సాహో’లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్


‘సాహో’లో బిగ్ సప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో మెరవనున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులని బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో ‘సాహో’కు బాలీవుడ్ లో మరింత క్రేజ్ ని తీసుకొచ్చేందుకు సల్మాన్ గెస్ట్ రోల్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కథాగమనంలోని ఓ కీలకమైన సమయంలో సల్మాన్ మెరుస్తాడట.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కుతోంది. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాహో స్రపైజ్ పోస్టర్ కు మంచి స్పందన దక్కింది. అత్యధిక లెకులని సొంతం చేసుకొన్న పోస్టర్ గా రికార్డ్ కెక్కింది. ఇకపై కూడా సాహో నుంచి వారానికో అప్ డేట్ రానుంది.