సమంతతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదట.. !

‘నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు’ అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. అమె ప్రధాన ప్రాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకురాలు. సమంతకి జంటగా నాగశౌర్య నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. స్టోరీ లైన్ ని లీక్ చేస్తూ ఎంటర్ టైనింగ్ గా టీజర్ ని కట్ చేశారు.

ఇందులో సమంత మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని టీజర్ అర్థమైంది. యువతిగా, మధ్య వయస్కురాలిగా, ముసలి పాత్రలో కనిపించనుంది. ఇందులో రెండు పాత్రలో సామ్ ని కనిపించింది. ముసలి పాత్రలో కూడా సామ్ ని కనిపించాల్సి ఉంది. కొన్ని కారణాల వలన సీనియర్ నటిని పెట్టారు.

ఇక, టీజర్ విషయానికొస్తే.. బోయ్ ఫ్రెండ్స్ ఎవరు లేదుకదా ? అని నాగశౌర్య అడిగిన ప్రశ్నకు.. ‘నేను మాంచి వయసులో ఉన్నప్పుడే.. మా ఆయన పోయాడు. అప్పటికే నాని గాడు పుట్టేశాడు. ఇంకా మళ్లీ పెటాకులు ఎందుకని.. వాడ్ని పెంచి పెద్ద చేశా. ఆడు పెళ్లి చేసుకొని ఇద్దరిని కన్నాడు. వాళ్లు కూడా పెళ్లీడుకొచ్చేశారు. నాకు వయసైపోయిందని సమాధానిస్తోంది. ఇక ఆఖరిలో నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. ఒక్కొక్కడికి.. చూస్తారుగా.. అంటూ సమంత చెప్పే డైలాగ్ ఆకట్టుకొంది.