మహేష్ హీరోగా ‘యాత్ర2’ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు పాదయాత్ర చేయబోతున్నాడా ? ఆ పాదయాత్రతో వచ్చిన క్రేజ్ ద్వారా ముఖ్యమంత్రి కాబోతున్నాడా.. ?? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద’యాత్ర’ తెరపై కూడా ఘన విజయం అయింది. ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. వైఎస్ఆర్ పాత్రలో దిగ్గజ నటుడు మమ్ముట్టి నటించారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన విధానం, వారి కష్టసుఖాలు అడిగితెలుసుకున్న విధానాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఫలితంగా ‘యాత్ర’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా సీక్వెల్ రాబోతుంది. ఈ మేరకు మహి ట్విట్ చేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం నేపథ్యంలో.. ‘యాత్ర’ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ట్విటర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. “కంగ్రాట్స్ జగనన్నా. ఈ విజయానికి నీవు అర్హుడివి. మీ తండ్రి వైఎస్ఆర్ కంటే అద్భుతమైన పాలన అందిస్తావని ఆశిస్తున్నాను. నీవు సరికొత్త అధ్యాయాన్ని రచించావు. నీది ప్రజలకు చెప్పి తీరాల్సిన కథ” అని రాసుకొచ్చారు. యాత్ర 2 హ్యాష్ ట్యాగ్ జతచేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే యాత్ర 2 రాబోతుందని చెప్పుకొంటున్నారు. ఐతే, యాత్ర2లో హీరోగా మహేష్ అయితే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


‘భరత్ అను నేను’ సినిమాలో యువ సీఎంగా మహేష్ అదరగొట్టాడు. సినిమాలో పాదయాత్ర చేసిన అనుభవం మహేష్ కు ఉంది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షితో మహేష్ విద్యార్థులు, రైతుల మనసులు దోచేశాడు. ఈ నేపథ్యంలో జగన్ యాత్రలో మహేష్ కథానాయకుడుగా నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహేష్ కాదంటే.. ఆ అవకాశం రానాకి దక్కొచ్చు. ఐతే, జగన్ పాత్ర రానా కనిపించే విషయంలో ఓ నెగటివ్ ఉంది. ఎన్ టీఆర్ బయోపిక్ లో ఆయన చంద్రబాబు నాయుడుగా కనిపించారు. చంద్రబాబుగా కనిపించిన రానాలో జగన్ చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడరేమో. అందుకే జగన్ గా మహేష్ మంచి ఆప్షన్.