ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ భేటీ

కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవబోతున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకి హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.

మరికొద్దిసేపట్లో వైకాపా సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమవేశంలో సీఎల్పీ నేతగా జగన్ ని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ప్రమాణస్వీకారం ఏర్పాట్లపై పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారు. ఇవన్నీ ముగించుకొని సాయంత్రం జగన్ హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 4.30కి జగన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు. అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళతారు. సీఎం కేసీఆర్‌ను, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లను కలుస్తారు. ఇక, రేపు ఢిలీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలుస్తారు జగన్. ప్రమాణస్వీకారానికి ప్రధానిని ఆహ్వానిస్తారు.