వివాదంలో టూ స్టేట్స్


టాలీవుడ్ లో మరో దర్శకుడు కోర్టుకెక్కాడు. ఇటీవలే ‘ఓటర్’ దర్శకుడు కార్తీ క్ రెడ్డి హీరో మంచు విష్ణు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విష్ణు తనని మోసం చేశాడు. తన కథలో మార్పు చేశారు. టైటిల్ ని మార్చేశారు. సినిమా క్రెడిట్ కొట్టేశారని ఆరోపించారు. ఫైనల్ ఈ వివాదం పరిష్కారం అయింది. సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలావుండగా.. టూ స్టేట్స్ వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్‌ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ కథానాయికగా పరిచయం కాబోతున్న చిత్రమిది. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ రెడ్డి నిర్మాత ఎం.ఎల్.వి సత్య నారాయణ (సత్తిబాబు)పై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, తనకు తెలియకుండా నిర్మాత కథలో మార్పులు చేశారని ఆరోపించారు. సినిమా నుంచి తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన కోర్టు నిర్మాత సత్యనారాయణ ఈ నెల 30న హాజరై, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘2 స్టేట్స్’. దీనికి తెలుగు రీమేక్‌గా అదే టైటిల్‌తో ‘టూ స్టేట్స్‌’ను రూపొందిస్తున్నారు. అడవిశేష్-శివానీ జంటగా నటిస్తున్నారు