నిజామాబాద్‌ ను వదలను : కవిత


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఓడటమే సంచలనం. ఓటమి నేపథ్యంలో నిజామాబాద్ స్థానాన్ని కవిత వదిలేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కవిత స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈ నియోజకవర్గాన్ని ఎప్పటికీ వీడనన్నారు కవిత. నిజామాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మంచికప్పలో తెరాస కార్యకర్త కిశోర్‌ గుండెపోటుతో మరణించగా.. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి కవిత పరామర్శించారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. “ఈసారి ప్రజలు నన్ను కాదని వాళ్లని గెలిపించారు. గెలిచినవారు హామీలు నెరవేర్చాలన్నారు. తెరాస కార్యకర్తలకు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రజల మధ్య ఉంటూ.. అందరికీ అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. పదవులు ఉన్నా..లేకున్నా తెలంగాణ కోసం పని చేస్తానని వెల్లడించారు.