ప్రభాస్ రేసు మొదలెట్టాడు.. !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలైంట్ గా రేసు మొదలెట్టేశాడు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్దా కపూర్ కథానాయిక. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది చిత్రబృందం. ఇటీవలే రిలీజ్ డేటుని ఖరారు చేస్తూ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ కళ్లజోడుపెట్టుకొని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. తాజాగా, సాహో నుంచి కొత్త పోస్టర్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ బైక్ పై దూసుకెళ్తున్నాడు. ప్రభాస్ రేసు మొదలెట్టాడు అన్నమాట. ఇక రికార్డులు బ్రేక్ అయినట్టే.