‘ఓటర్’ దర్శకుడి నోరు మూయించారుగా.. !

మంచు విష్ణు సినిమా ‘ఓటర్’ విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దర్శకుడు కార్తీక్ రెడ్డి విష్ణుపై సంచలన ఆరోపణలు చేశారు. విష్ణు తనని బెదిరించాడు. స్కిప్ట్ ని మార్చాలని ఒత్తిడి తెచ్చారు. బెదిరించి సినిమా క్రెడిట్ తీసుకొన్నారని ఆరోపించారు. మంచు ఫ్యామిలీ నుంచి తనకి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీనిపై మంచు విష్ణు ఇప్పటివరకు స్పందించలేదు.

మరోవైపు, ‘ఓటర్’ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. రిలీజ్ కి రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఓటర్ దర్శకుడు కార్తీక్ రెడ్డి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన్ని మంచు ఫ్యామిలీ పిలిచి మాట్లాడింది. న్యాయం చేసిందా.. ? లేదంటే బెదిరింపులతో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ఎలాగూ సినిమా ప్రమోషన్స్ టైంలో ఈ విషయాలపై మీడియా కూపీ లాగడం ఖాయం. ప్రస్తుతానికైతే.. కార్తీక్ రెడ్డి నోరు మూయించేశారు.

‘ఓటర్’లో విష్ణుకి జంటగా సురభి జతకట్టింది. జూన్ మొదటి వారంలోనే ఓటర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసింది. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని చిత్రబృందం చెబుతోంది.