ఆల్ ఈజ్ వెల్ అంటోన్న కల్యాణ్

నాగశౌర్య హీరోగా ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ తో ఓ సినిమా అనుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. కానీ ఇప్పుడా సినిమాలో హీరోగా కల్యాణ్ రామ్ నటించబోతున్నాడు. కల్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

క‌ల్యాణ్ రామ్ ఈమ‌ధ్య రూటు మార్చాడు. ‘118’తో ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. అది మంచి ఫ‌లితం ఇచ్చింది. ‘తుగ్ల‌క్‌’తో మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ బాట ప‌ట్టాడు. మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌సాలా అంశాలు ఎక్కువ ఉండ‌బోతున్నాయి. అందుకే క‌ల్యాణ్ రామ్ మ‌ళ్లీ రూటు మార్చారు. త‌న త‌దుప‌రి చిత్రం.. కుటుంబ క‌థా నేప‌థ్యంలో ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సతీష్ వేగేశ్న చెప్పిన ఆల్ ఈజ్ వెల్ కథని ఓకే చేసినట్టు తెలుస్తోంది.