మహర్షి @175కోట్లు !

బాక్సాఫీస్ దగ్గర ‘మహర్షి’ హవా కొనసాగుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ రూ. 175కోట్ల గ్రాస్ ని దాటేశాయి. కలెక్షన్స్ ఇంకా నిలకడగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహర్షి రూ. 200కోట్ల మార్క్ ని అందుకుంటుందా ? అన్నది ఆసక్తిగా మారింది.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటించారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. సినిమాలో దేశంలోని విద్యా వ్యవస్థ, రైతుల సమస్యలపై గళమెత్తారు. అది ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ పాపులర్ అయింది. మహర్షి సినిమాతో అభిమానులు, మహేష్ సైతం కాలరెగిరేయడం విశేషం.

ఇక, మహేష్ తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సరిలేరు నీకెవ్వరు, వాట్సాప్, రెడ్డిగారి అబ్బాయి టైటిల్స్ వినిపిస్తున్నాయి. వీటిలో రెడ్డిగారి అబ్బాయి టైటిల్ దాదాపు ఫిక్సయినట్టేనని చెబుతున్నారు. త్వరలోనే సినిమాని ప్రారంభించబోతున్నారు.