తేజుకు ప్రతిరోజు పండగే

‘చిత్రలహరి’తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు సాయి తేజు. ఇకపై ఆయనకి ప్రతిరోజు పండగే అంటున్నారు. ఎందుకంటే ? తేజ్ ఓ కొత్త పద్దతి పెట్టుకున్నారు. తను చేయబోయే సినిమా ఏదయినా కథను మెగామామయ్య చిరంజీవికి చెప్పి, ఓకె చేయించుకోవడం. చిత్రలహరి కథని మెగాస్టార్ నే ఓకే చేశాడు. షూటింగ్ సమయంలో సలహాలు, సూచనలు చేశారు. అవి బాగా పని చేశాయి. ఫలితంగా చిత్రలహరి సూపర్ హిట్ అయింది. తేజుని తిరిగి నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే మామయ్య ఓకే చెబితే తేజు సినిమా చేయనున్నాడు

తేజు తరువాత సినిమా మారుతి దర్శకత్వంలో ఉండనుంది. ఇటీవలే మారుతి మెగాస్టార్ చిరంజీవికి నెరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా విని ఓకె చేసినట్లు తెలుస్తోంది. దీంతో తేజు-మారుతి సినిమాకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రం కోసం ‘ప్రతి రోజు పండగే’, ‘బోగి’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వచ్చే యేడాది సంక్రాంత్రికి విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ‘బోగి’ టైటిల్ అనుకొంటున్నారంట.

ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.