ప్రధాని కాబోతున్న సీనియర్ హీరోయిన్


బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. అలాగని నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని కావడానికి ఇబ్బందేమీ లేదు. ఇది సినిమా ముచ్చట. కన్నడ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని తెచ్చుకొంది. మంచి వసూళ్లని సాధించింది. బాలీవుడ్ ప్రేక్షకులు ‘కేజీఎఫ్’కు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ ని రెడీ చేస్తోంది చిత్రబృందం. సీక్వెల్ లో పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు.

సీక్వెల్ లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్‌ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇందిరా గాంధీకి రవీనా టండన్‌ కి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. అందుకే చిత్రబృందం ఆమెని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రవీనా షూటింగ్ లో పాల్గొంటారని చెబుతున్నారు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ‘కేజీఎఫ్’ వచ్చింది. మరీ.. సీక్వెల్ లో ఎలా ఉండబోతుందనేది చూడాలి.