వైరల్ : సూర్యతో ఫ్యాన్ మూమెంట్

టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ్ స్టార్ సూర్య. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. సూర్య తాజా చిత్రం ‘ఎన్ జీకే’. తెలుగులోనూ అదే టైటిల్ తో తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకుడు. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. ఈవారమే (మే31) ‘ఎన్ జీకే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో ‘ఎన్ జీకే’ ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి సూర్య, ఇద్దరు హీరోయిన్లు సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, ఇతర చిత్రబృందం హాజరైంది. ఈ సందర్భంగా చోటు చేసుకొన్న ఫ్యాన్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై సూర్యతో సెల్ఫీ దిగేందుకు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని ఓ అభిమాని దూసుకొచ్చాడు. అభిమాని అభిమానం, ఆతృతని చూసి… స్వయంగా సూర్య తన చేతులతో సెల్ఫీ తీసి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్యాన్ మూమెంట్ ని మీరు ఓసారి చూసేయండీ.. !