దుర్గమ్మ సేవలో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనక దుర్గమ్మని దర్శించుకోనున్నారు. జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు విజయవాడ చేరుకున్న సీఎం కేసీఆర్ దుర్గమ్మను దర్శించుకుంటారు. ఇక, సాయంత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరు ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. వీరితో పాటు గవర్నర్ నరసింహాన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.

మరోవైపు, మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ ను ఆయన నివాసంలో టీటీడీ ఈవో సింఘాల్‌, డాలర్‌ శేషాద్రి, పురోహితులు కలిశారు. పురోహితులు శ్రీవారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.