మహేష్ కోసం మళ్లీ ముగ్గురు.. !!

సూపర్ స్టార్ మహేష్26 చిత్రానికి ముహూర్తం ఫిక్సయింది. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ త్రానికి అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తారు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ చిత్రానికి కూడా ముగ్గురు నిర్మాతలు అని తెలుస్తోంది. దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో పాటు ఈ చిత్ర నిర్మాణంలో మహేష్‌బాబు కూడా భాగం కానున్నారు.

ఈ చిత్రం కోసం సరిలేరు నీకెవ్వరు, వాట్సాప్, రెడ్డిగారి అబ్బాయి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటి నుంచి ఒక టైటిల్ ని ఫైనల్ చేయనున్నారు. సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

‘మహర్షి’ సినిమా కోసం ముగ్గురు నిర్మాతలు పని చేశారు. దాని కారణంగా కొన్ని సమస్యలు తలెత్తాయని.. ఫలితంగా బడ్జెట్ పెరిగిపోయిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా ఇద్దరు ముగ్గురు నిర్మాతలతో సినిమా చేయకుండని మహేష్ డిసైడ్ అయినట్టు చెప్పుకొన్నారు. అయినా.. మహేష్ మరోసారి రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.