‘భారత్‌’ పేరు మార్చాల్సిందే.. !


బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భారత్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ కథానాయికలు. కొరియన్‌ సినిమా ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కు హిందీ రీమేక్‌ ఇది. ఇందులో సల్మాన్‌ 18 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ గెటప్‌లలో కనిపించనున్నారు. జూన్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది.

చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలని కూడా మొదలెట్టేసింది. సల్మాన్, కత్రినా కలిసి మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘భారత్’ టైటిల్‌పై వివాదం నెలకొంది. భారత్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ‘భారత్‌’ అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటం సరికాదని, టైటిల్‌ను వెంటనే మార్చాలని విపిన్‌ త్యాగీ అనే వ్యక్తి డిమాండ్‌ చేశారు. ఇది చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.