కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి


కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా గాంధీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. భాజాపా జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా ఎన్డీయేని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తొలిసారి కేంద్ర కేబినేట్ లో చేరారు. కేంద్రహోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిఅషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రక్షణశాఖ మంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సమాచారశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.