బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకురాలిగా సోనియా గాంధీ ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలిగా సోనియాగాంధీ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆమె పేరుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు.

మరోవైపు, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని రాహుల్ గాంధీని పార్లమెంటరీ సభ్యులు విజ్ఝప్తి చేశారు. ఐతే, రాహుల్ మాత్రం ససేమిరా అన్నట్టు సమాచారమ్. పార్టీలో యాక్టివ్ గా ఉంటా. కీలకంగా వ్యవహరిస్తా. కానీ, అధ్యక్ష పదవిలో కొనసాగలేనని రాహుల్ అన్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు రాహుల్ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు కాంగ్రెస్ లో కనిపించడం లేదు. అందుకే మూడ్నాలుగు నెలల సమయం తీసుకొని కొత్త అధ్యక్షుడుని ఎన్నుకుందామని రాహుల్ అన్నట్టు తెలుస్తోంది.