ఆసుపత్రిలో చేరిన పోసాని.. అసలేమైంది ?


ప్రముఖ దర్శకుడు, నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఆదివారం వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లి పోసానిని పరామర్శించారు. ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంతకీ పోసానికి వచ్చిన అనారోగ్య సమస్య ఏంటీ ? అన్నది తెలియరాలేదు.

పోసాని దర్శకుడిగా, రచయితగా పోసాని ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ కి పులిస్టాప్ పెట్టేసి.. నటుడుగా మాత్రమే కొనసాగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఈ మధ్య విడుదలవుతున్న ప్రతి సినిమాలో ఆయన కనిపిస్తున్నారు. పొలిటికల్ గానూ పోసాని సూపర్ హిట్. ఏపీలో జగన్ విజయానికి పోసాని కృషి చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల వేళ వైకాపా తరుపున తన వాయిస్ వినిపించారు. ఇప్పుడు ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చి.. పోసాని అనారోగ్యానికి గురికావడం విచారకరం. ఆయన త్వరలోనే కోలుకోవాలని.. మరిన్ని సినిమాలు చేస్తూ అలరించాలని ఆశిద్దాం.