అడవిశేష్ సీక్రెట్ గా కానిచ్చేస్తున్నాడు


యువ హీరో అడివి శేష్‌ చాలా సీక్రెట్ గా కానిచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా వెంకట్‌ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎవరు’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ” ‘గూఢచారి’ తర్వాత నా తర్వాతి ప్రాజెక్ట్‌ ‘ఎవరు’. మీకు ట్విస్ట్‌ ఇవ్వడానికి రహస్యంగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నాం” అని శేష్ ట్విట్ చేశారు.

‘ఎవరు’ క్రైమ్ థిల్లర్ అని ఫస్ట్ లుక్ ని చూస్తే అర్థమవుతోంది. పగిలిన అద్దంపై వర్షపు నీరు, రక్తపుధారలు కారుతున్నట్లుగా కనిపిస్తున్న లుక్‌ను ఫస్ట్ లుక్ గా వదిలారు. ఇందులో శేష్ జంటగా రెజీనా నటిస్తున్నారు. నవీన్‌ చంద్ర, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రసాద్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, కెవిన్‌ ఆన్నే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 23న ‘ఎవరు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.