నిర్మాతని నిరాశపరిచిన బేబీ.. !!

‘నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. మీరే చూస్తారుగా’ అంటూ ఊరించింది సమంత. ఆమె తాజా చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి రీమేక్ ఇది. ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఇరవై ఏళ్ల అమ్మాయిగా మారడమనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జులై5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ లో సమంత చెప్పినట్టుగా… బేబీతో ఎంజాయ్ మెంట్ ఓ రేంజ్ లో ఏమీ ఉండదట. ఇప్పటికే సినిమా చూసిన నిర్మాత సురేష్ బాబు సినిమా అవుట్ పుట్ పై అంసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారమ్. ఒరిజినల్ వెర్షన్ చూసి ఇంప్రెస్ అయిన సురేష్ బాబు ‘ఓ బేబీ’ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారట. రీషూట్ కి వెళ్లే ఆలోచన చేసినా.. అందుకు తగిన సమయం లేకపోవడంతో.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నారట. ఈ ప్రచారంలో నిజమెంత ? తెలీదు. కానీ, ఓ బేబీ క్రేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉంది.