మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెరాస గెలుపు

తెలంగాణలో మరోసారి కారు జోరు చూపించింది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఘన విజయం సాధించింది.

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మిపై తెరాస అభ్యర్థి చిన్నపరెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. గెలుపొందిన ఎమ్మెల్సీలకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.