వైరల్ : ఇళయరాజా దురుసు ప్రవర్తన (వీడియో)

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా మరోసారి వివాదంలో ఇరుకొన్నారు. ఇటీవల ఇళయరాజా.. తన 76వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇళయరాజా కోసం ఓ కచేరీ వేడుకను నిర్వహించారు. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు మంచి నీళ్ల సీసాలు ఇవ్వడానికి స్టేజ్‌ పైకి వచ్చారు. దాంతో ఇళయరాజా అతని తీరుపై మండిపడ్డారు.

అనుమతి లేకుండా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తున్నావ్‌?’ అని తిట్టిపోశారు. దాంతో సదరు వ్యక్తి క్షమాపణలు చెబుతూ ఇళయరాజా కాళ్లు పట్టుకున్నారు. అక్కడితో ఇళయరాజా శాంతించలేదు. రూ.10 వేలు ఇచ్చి సీట్లు బుక్‌ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 ఇచ్చి సీట్లు కొనుక్కున వారు కూర్చున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇళయరాజా.. ఇది మీకు తగునా ? అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.